హైదరాబాద్:హైదరాబాద్లో నకిలీ నోట్ల తయారీ స్కాంలో ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.హైదరాబాదు నగరంలో నకిలీ నోట్లు తయారీ స్కాం వెలుగులో కి వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ నకిలీ నోట్ల తయారీ స్కాంపై కేసు నమోదు చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.అయితే ఈ కేసులో ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా రూ.17 కోట్ల 70 లక్షల హవాలా మరియు దొంగనోట్ల భారీ స్కాంను పోలీసులు గుట్టు రట్టు చేశారు.ఇందులో గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు పూజారులతో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.వేల్పూర్ పవన్ కుమార్,దొండపాటి రామకృష్ణ,నలబోతుల పోతుల సురేష్ గోపి,చందలూరి విజయ్ కుమార్ (పూజారి),కుంభం పాటి సూర్య,చందలూరి నాగేంద్రప్రసాద్ శర్మ ఈ ఆరుగురు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వారు.(పూజారి) బెల్లం కొండ మురళి కృష్ణ శర్మ(పూజారి) ఇతను మాత్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన వాడు.నకిలీ నోట్ల తయారీ చెలామణి విష యంలో పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు పూజారులతో పాటు మరో నలుగురిని కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచనున్నా రు.అయితే పూజారుల ఇంట్లో ఇలాంటి సొమ్ము పట్టుబడడంతో పోలీసులు షాక్ తిన్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...