కరీంనగర్:కరీంనగర్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఓ వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు.పక్కా సమాచారంతో వ్యభిచార స్థావరంపై దా డులు చేసి విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే మాన కొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బొమ్మరవేని సాయికుమార్,అతని భార్య కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట ప్రాంతంలో నివాసం ఉంటు న్నారు.విలాస జీవితం గడిపేందుకు వీరు అడ్డదారులు తొక్కారు.కొన్నాళ్లుగా వ్యభిచార దందా నిర్వహిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.వీరు వాట్సాప్ ద్వారా విటు లకు యువతుల ఫోటోలను పంపిస్తారు.గంటకో రేటు చొప్పున వారితో డీల్ మాట్లాడుకుంటారు.ఆపై మంకమ్మతోటలోని తమ ఇంట్లో లేదా నగర శివారులోని కాలనీ ల్లో ఉన్న అపార్ట్మెంట్లు,ఇండిపెంట్ హౌస్లలో విటులకు ఏర్పాట్లు చేస్తారు.ఇటీవల ఈ వ్యభిచార దందాపై టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు.మంకమ్మతోటలోని ఆ దంపతుల ఇంటిపై దాడి చేశారు.దాడుల్లో హుస్నాబాద్కి చెందిన రామడుగు అశోక్,చందు,పొన్నం శంకర్ అనే వ్యక్తులు పట్టుబడ్డా రు.వీరి నుంచి రూ.37,380 నగదు,5 సెల్ఫోన్లు,10 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.వీరిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.వ్య భిచార నిర్వాహకులు బొమ్మరవేని సాయికుమార్,అతని భార్యకు ఎవరెవరు ఈ దందాకు సహకరిస్తున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు.వీరి వద్దకు వచ్చే విటుల్లో ప్రముఖ వ్యాపారులు,ప్రభుత్వ ఉద్యోగులు,రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.గోదావరిఖని,జగిత్యాల,వరంగల్,హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి యు వతులను తీసుకొచ్చి వారిని అద్దె ఇళ్లల్లో ఉంచి వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...