భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేశారు.జగదభిరాముని కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.స్వామివారి కల్యాణ వేడుకకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ,హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు,ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం,ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ ఘటం జరిగింది.
