హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే ‘నీరా’ దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున నెక్లెస్ రోడ్డు లో రూ.13 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ నీరా కేఫ్ను త్వరలోనే సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించను న్నారు తాటి,ఈత చెట్ల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నీరాను ప్రాసెస్ చేసి ఈ కేఫ్లో అమ్మనున్నారు.ఏక కాలంలో సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లోలా తాళ్లు,ఈదుల్లో కూర్చొని కళ్లు ఎంజాయ్ చేసిన అనుభూతి పొందేందుకుగానూ తాటి,ఈత మొద్దుల నమూనాల్లో సీటింగ్ అరెంజ్ చేశారు.కేఫ్ చుట్టూ తాటి చెట్లు వాటికి మట్టి కుండలు కట్టి అచ్చం గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు.ఈ కేఫ్ పైకప్పును కూడా తాటి ఆకు ఆకారంలో డిజైన్ చేశారు అధికారులు.ఈ కేఫ్లో ప్రస్తుతం ఏడు స్టాల్స్ సిద్ధంగా ఉన్నాయి.పదిహేను ఇరవై రోజుల్లో ఈ కేఫ్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.రాష్ట్రంలో మొట్ట మొదటి నీరా కేఫ్ ఇదే కావటం విశేషం.కాగా ఈ కేఫ్లో టేక్ అవే సౌకర్యం కూడా ఉంది.మరోవైపు కేఫ్ నుంచి ట్యాంక్ బండ్లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.తెలంగాణ ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఈ స్టాల్స్ను నడపడానికి నీరా ఉత్పత్తి,విక్రయాల కోసం లైసెన్సులను ప్రస్తు తం గౌడ సంఘం సభ్యులకు మాత్రమే ఇవ్వనున్నట్టు సమాచారం ఇది గీత కార్మికుల అస్థిత్వానికి ప్రతీకగా తెలంగాణ సర్కారు పేర్కొంటుంది.ప్రకృతి ప్రసాదితమైన కల్లుకు బ్రాండ్ తీసుకొస్తే గౌడ కుల వృత్తి పరిశ్రమ స్థాయికి ఎదుగుతుందన్న సర్కారు ఉద్దేశం.ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నీరా కేఫ్ను ప్రతిష్టత్మకంగా నిర్మచటం గమనార్హం.అయితే తాటి,ఈత,కొబ్బరి చెట్లతో పాటు ఖర్జూర,జీ లుగ చెట్ల నుంచి నీరాను ఉత్పత్తి చేస్తారు సాధారణంగా తాటి,ఈత చెట్లకు కొంత నీరు,మడ్డి కలిపిన కుండను చెట్టుకు కట్టడం వల్ల కల్లు వస్తుండగా నీరాను మాత్రం కొత్తకుండలో ఎలాంటి నీరు,మడ్డీ వేయకుండా తాజాగా తయారు చేస్తారు.ఇందులో నాలుగు శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది.అయితే,నీరాకు తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉటుంది.4 డిగ్రీల వద్ద ఉంచితే ఇది ఐదు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పటి వరకు కాంబోడియా,ఆఫ్రికా,ఇండోనేషియా,మలేషియా,శ్రీలంక వంటి దేశాల్లో నీరా ఉత్పత్తి అధికంగా ఉంది.ఏ చెట్టు నుంచి తయారు చేసిన నీరా అయినా రుచికి రుచి ఆరో గ్యానికి ఆరోగ్యం అందిస్తోందన్నది శాస్త్రం చెప్తున్న మాట.నీరాలో మెగ్నీషియం,కాల్షియం,ఐరన్,ఫాస్పరస్,పొటాషియం,ప్రొటీన్,షుగర్ మరియు విటమిన్-సి కలిగి ఉన్నందున ఇది అత్యంత పోషక మైనదిగా చెప్తారు.వ్యాధులను నివారించే ఔషధగుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది ఇది శరీరం యొక్క అంతర్గత ప్రక్షాళన చేసే మెకానిజాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉందని తద్వారా షుగర్,లివర్,గుండె సమస్యల వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుందట.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...