గోదావరిఖని:మన శరీరానికి రక్తం ఎంతో అవసరం అది ప్రాణ శక్తినిస్తుంది.శరీరంలోని అన్ని జీవ కణాలకు కావాల్సినంత జీవావయువు మరియు పోషకాలను అందిం చడమే కాక రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాలు,మాక్రోఫేజెస్,యాంటీ బాడీస్ మొదలైనవన్నీ రక్తం ద్వారానే శరీరమంతా చేరుతాయి.మన రక్తంలోని ఎ ర్రరక్త కణాలు ఆరోగ్యంగా లేక పోతే రక్తహీనత వచ్చే అవకాశం ఉంది.దీనినే అనీమియా అంటారు.దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపం.ఐరన్ బాగా తక్కువగా ఉన్న ప్పుడు కేవలం ఆహారంలో మార్పులతో దానిని పెంచడం సాధ్యం కాదు.మందులు లేదా సప్లిమెంట్లు వాడాలి.అయితే మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీ సుకుంటే ఐరన్ బలపడేలా చూసుకోవచ్చు.మాంసం తినాలి అనేసి అనుకొనే వాళ్ళు కోడి చేప లాంటివి వారానికి కనీసం మూడుసార్లు తీసుకుంటే తగినంత ఐరన్ లభిస్తుంది.శాకాహారులైతే అన్నిరకాల పప్పులు,నల్ల శనగలు,అలసందలు,ఉలవలు,సోయాబీన్స్,చిక్కుళ్లు మొదలైనవి రోజూ తీసుకోవాలి.తోటకూర,పాలకూర,గోం గూర తప్పనిసరి.మీరు ఐరన్ సప్లిమెంటు తీసుకుంటున్నట్లయితే వాటిని ఉదయాన్నే ఏం తినని ముందు వేసుకోవాలి.నిమ్మ,నారింజ లాంటి విటమిన్-సి అధికంగా ఉన్న పండ్లు,రసాలను తీసుకుంటే మందులలోని ఐరన్ను శరీరం పూర్తిగా పీల్చుకోగలుగుతుంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...