హైదరాబాద్:యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరియమ్మ మృతిపై కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్ స్పందించారు.ఎస్సీ మహిళ లాకప్ డెత్ అత్యంత బాధాకరమన్నారు.మరియమ్మ లాకప్డెత్ ఘటనలో పోలీసుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరియమ్మ మృతిపై విచారణకు ఆదేశించిన సీ ఎం నిజనిర్ధారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎస్సీలు పేదల పట్ల పోలీసుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలన్నారు.ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని వారికి అన్యాయం జరిగితే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.ఇలాంటి ఘటనలు ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్కు రూ.15 లక్షల పరిహారం ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నివాస గృహం మంజూరు చేస్తామన్నా రు.మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.