పెళ్ళిలో..మంగళసూత్రాన్ని దొంగిలించిన పూజారి

తూప్రాన్:మెదక్ జిల్లాల్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.పెళ్ళిని నిర్వహించాల్సిన పూజారే మంగళసూత్రాన్ని దొంగిలించాడు.పెళ్లి మంత్రాలు చదువుతూ సందట్లో సడే మియాలా మూడు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసి తన చొక్కా జేబులో వేసుకున్నాడు.ఈ విషయం పెళ్లి వీడియోలో బయటపడింది.ఆ తర్వాత పెళ్లింటి వారు ఫిర్యాదు ఆ పురోహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పెళ్లిని జరిపించేదుకు పురోహితుడు సిద్ధమయ్యాడు.మంత్రాలు చాలా వేగంగా చదువుతున్నాడు.ఈ క్రమంలో ముహూర్త సమయం సమీపిస్తోంది.ఇంతలోనే మంగళసూత్రం కనిపించకుండా పోయింది.దీంతో పెళ్లి కుటుంబాల సభ్యులంతా గాబారా పడ్డారు.తెచ్చిన మంగళసూత్రం ఎలా మాయమైందంటూ వారు ఒకరిని ఒకరు ప్రశ్నించుకోసాగారు.చివరకు మంగళసూత్రం లేకుండానే పసుపు తాడుకు ప సుపు కొమ్ము కట్టించి వధువు మెడలో మూడుముళ్లు వేయించాడు పురోహితుడు.అయితే ఈ పురోహితుడి చేతివాటం పెళ్లి వీడియోలో రికార్డు అయింది.దీనిపై పెళ్లి ఇంటివారు తుఫ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here