గాంధీ దవాఖానాను సందర్శించిన కేసీఆర్..

హైదరాబాద్:ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు,కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ గాంధీ దవాఖానాను సంద ర్శించారు.గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసియు,ఎమర్జెన్సీ,ఔట్ పేషెంట్ వార్డులు సహా,పలు జనరల్ వార్డులలో సీఎం కలియతిరిగారు.బెడ్ల వద్దకు వెళ్లి పేషెంట్లతో నేరుగా మాట్లాడారు.వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.వారికి దైర్యం చెప్పారు.మీకు చికిత్స సరిగ్గా అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు.భోజనం ఎట్లా వున్నదని అడిగా రు.తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వైద్యాధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు కదిలారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను సీఎం పరిశీలించారు.నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్ ను తయారు చేసే ప్లాంట్ ను ఇటీవలే గాంధీలో సీఎం ఆదేశాల మేరకు నెలకొల్పారు.గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో జూనియర్ డాక్టర్ల తో సీఎం మాట్లాడారు.ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు.వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు.ఈ సేవలను కొనసా గించండి.మీకు ఏ సమస్య వున్నా అవసరం వున్నా నన్ను సంప్రదించండి.నేను సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తాను అని సీఎం వారికి భరోసానిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here