పశ్చిమ గోదావరి:అగ్నిప్రమాదానికి ఐదు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి సమీపంలోని గురకల పేట లో జరిగింది.కూలీలు రోజు పనులకు వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి వెళ్తారు.అయితే ఆ దీపం కిందపడటంతో మంటలు వ్యాపించాయి.మంటలు పక్కన ఇంటికి తాకాయి దీంతో పక్కింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు పెద్దగా వ్యాపించాయి.చుట్టూ ఉన్న ఐదు ఇల్లు కాలి బూడిదయ్యాయి.స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.ఉరదళ సుబ్బారావు,అనిక దశరథ,పి.తులసి,కెల్లా అప్పలనాయుడు,కెల్లా శాంత ఇళ్లు దగ్ధమయ్యాయి.ఆస్తి నష్టం సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా ఈ ఘటనకు ఎలుకే కారణమని అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
Latest article
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...