పశ్చిమ గోదావరి:అగ్నిప్రమాదానికి ఐదు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి సమీపంలోని గురకల పేట లో జరిగింది.కూలీలు రోజు పనులకు వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి వెళ్తారు.అయితే ఆ దీపం కిందపడటంతో మంటలు వ్యాపించాయి.మంటలు పక్కన ఇంటికి తాకాయి దీంతో పక్కింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు పెద్దగా వ్యాపించాయి.చుట్టూ ఉన్న ఐదు ఇల్లు కాలి బూడిదయ్యాయి.స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.ఉరదళ సుబ్బారావు,అనిక దశరథ,పి.తులసి,కెల్లా అప్పలనాయుడు,కెల్లా శాంత ఇళ్లు దగ్ధమయ్యాయి.ఆస్తి నష్టం సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా ఈ ఘటనకు ఎలుకే కారణమని అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...