కొలంబో:శ్రీలంక రాజధాని కొలంబోలో గురువారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక అలవోకగా విజయం సాధించింది.82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకున్నది.మూడు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో 82 పరుగులు చేసింది.తద్వారా 2-1 తేడా తో టీ-20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకున్నది.లంకేయులు బౌలింగ్లో టీమ్ ఇండియాను పూర్తిగా కట్టడి చేశారు.టీం ఇండియాను 20 ఓవర్లలో 81 పరుగులకు పరిమితం చేశారు.వానిందు హసరంగ తన బౌలింగ్లో టీం ఇండియాకు చెందిన నాలుగు వికెట్లు చే జిక్కించుకున్నారు.గమ్మత్తేమిటంటే హసరంగ బర్త్డే ఈ రోజు కావ డం గమనార్హం.టీం ఇండియాతో ఆడిన టీ-20 మ్యాచ్ల్లో తొమ్మిది పరుగులకే హసరంగ నాలుగు వికెట్లు తీసుకున్నారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్,మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా హసరంగ ఎంపికయ్యాడు.రెండు జట్ల మధ్య హసరంగది రెండో బెస్ట్ బౌలింగ్గా నిలిచింది.ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీం ఇండియా కేవలం 81 పరుగులు చేయ డం దాని చరిత్రలో మూడో అతి తక్కవ స్కోర్.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...