కొలంబో:శ్రీలంక రాజధాని కొలంబోలో గురువారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక అలవోకగా విజయం సాధించింది.82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకున్నది.మూడు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో 82 పరుగులు చేసింది.తద్వారా 2-1 తేడా తో టీ-20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకున్నది.లంకేయులు బౌలింగ్లో టీమ్ ఇండియాను పూర్తిగా కట్టడి చేశారు.టీం ఇండియాను 20 ఓవర్లలో 81 పరుగులకు పరిమితం చేశారు.వానిందు హసరంగ తన బౌలింగ్లో టీం ఇండియాకు చెందిన నాలుగు వికెట్లు చే జిక్కించుకున్నారు.గమ్మత్తేమిటంటే హసరంగ బర్త్డే ఈ రోజు కావ డం గమనార్హం.టీం ఇండియాతో ఆడిన టీ-20 మ్యాచ్ల్లో తొమ్మిది పరుగులకే హసరంగ నాలుగు వికెట్లు తీసుకున్నారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్,మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా హసరంగ ఎంపికయ్యాడు.రెండు జట్ల మధ్య హసరంగది రెండో బెస్ట్ బౌలింగ్గా నిలిచింది.ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీం ఇండియా కేవలం 81 పరుగులు చేయ డం దాని చరిత్రలో మూడో అతి తక్కవ స్కోర్.
Latest article
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...