జమ్మికుంట:ఈటల రాజేందర్ రాజీనామాతో సీఎం కెసిఆర్ హుజూరాబాద్ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.ఎన్నికల కోసమే పథకాలు ప్రవేశ పెడతా మని బాహాటంగా చెప్పిన సీఎం దళిత బంధు పథకం రూపొందించి హుజూరాబాద్ నియోజకవర్గం నుండే అమలు చేయాలని నిర్ణయించారు.దీంతో దళిత బంధు పథ కం ఈటెల రాజేందర్ వల్లనే తమకు అందబోతుంది అని హుజూరాబాద్ నియోజకవర్గ దళితులు ఈటల కు గత రెండు రోజులుగా పాలాభిషేకాలు చేస్తున్నారు.ఈరోజు పాదయాత్రలో భాగంగా విలాస్ సాగర్ వచ్చిన సందర్భంగా గ్రామంలోని దళిత యువకులు ఈటెల కాళ్ళను పాలతో కడుగుదామని వచ్చారు.దీంతో ముందుగా వారి కాళ్ళు మొక్కారు ఈటల రాజేందర్.దళితుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు.ముందుగా తాను కాళ్ళు మొక్కిన తరువాతనే కాళ్ళు కడగటానికి అవకాశం ఇచ్చారు.ఇది కాదా దళితుల మీద నిజమైన ప్రేమ అని దళిత నేతలు అంటున్నారు.ఈటెల రాజేందర్ రాజీనామా వల్లనే తమకు దళిత బందు రాబోతుంది అని ఈటెల కు ఖచ్చితంగా అండగా ఉంటామని అంటున్నారు.