ముంబై:రియల్మీ మనదేశంలో రూ.10 వేలలోపు ధరలోనే 5జీ ఫోన్ లాంచ్ చేయనుంది.2022లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ అధికారికంగా ప్రకటించారు.రియల్మీ మనదేశంలో రూ.10 వేలలోపే 5జీ ఫోన్ లాంచ్ చేయనుంది.2022లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు.దీంతోపాటు రూ.15 వేలకు పైబడిన ధరతో రియల్ మీ లాంచ్ చేసే ఫోన్లన్నిటిలో 5జీ కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు.గతేడాది ఫిబ్రవరిలో లాంచ్ అయిన రియల్మీ ఎక్స్50 ప్రో మనదేశంలో మొదటి 5జీ ఫోన్.ఆ తర్వాత రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ,రియల్మీ నార్జో 30 ప్రో 5జీ,రియల్మీ 8 5జీ ఫోన్లతో తన 5జీ ఫోన్ల సంఖ్యను రియల్మీ భారీగా పెంచింది.మోస్ట్ ప్రీమియం సెగ్మెంట్ల నుంచి బడ్జెట్ విభాగం వరకు 5జీని అందరికీ అందుబాటులోకి తీసు కువెళ్లి ఆ విభాగంలో ముందంజలో నిలవాలన్నదే రియల్మీ లక్ష్యమని మాధవ్ సేథ్ తెలిపారు.రియల్మీ జీటీ ఉత్పత్తుల ద్వారా 5జీ ఉత్పత్తులను భవిష్యత్తులో కూ డా లాంచ్ చేస్తామని కంపెనీ పేర్కొంది.జీటీ మోడల్స్ అంటే కేవలం ఒక్క ఉత్పత్తే కాదని భవిష్యత్తులో ఎన్నో వస్తాయని పేర్కొన్నారు.గతంలో రూ.30 వేలకు పైబడిన అన్ని ఫోన్లలో 5జీని అందిస్తామని రియల్మీ తెలిపింది.ఇప్పుడు రూ.15 వేలకు పైబడిన కూడా ఫోన్లలో కూడా అందిస్తామని ప్రకటించింది.గత నెలలో 100 డాలర్ల ధరలో(సుమారు రూ.7,500) 5జీ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు కూడా రియల్మీ ప్రకటించింది.స్మార్ట్ ఫోన్లతో పాటు ట్రూవైర్లెస్ ఇయర్బడ్స్,రబుల్స్,వీలు,ప్టా ప్స్,ట్యాబ్లెట్లు వంటి వాటిపై కూడా దృష్టి పెట్టనున్నట్లు రియల్మీ ప్రకటించింది.ఐఓటీ ఉత్పత్తులకు ఓపెన్ ప్లాట్ఫాం సపోర్ట్ను కూడా అందించనున్నట్లు రియల్మీ పేర్కొంది.మీడియాటెక్ ఇండియా కార్పొరేట్ సేల్స్,బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ కుల్దీప్ మాలిక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 5జీ టెక్నాలజీని అందించే మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు 4.5 కోట్ల యూనిట్లను తాము ఇంతవరకు విక్రయించినట్లు తెలిపారు.మనదేశంలో 5జీకి సంబంధించిన ట్రయల్స్ కూడా ఇప్పటికే ప్రారంభం కానప్పటికీ కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారిలో 26 శాతం మంది 5జీ ఫీచర్ కోసం చూస్తున్నట్లు తెలిపింది.