బెంగుళూర్:అణగారిన వర్గాలు అంటే సమాజంలో చిన్న చూపే ఇక పోలీసుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.బలమైన సామాజిక వర్గం వారు ఏదీ చెబితే అదే జరు గుతుంది.కర్ణాటక చిక్ మంగళూర్ జిల్లాలో అలాంటి ఘటన జరిగింది.ఓ యువకుడిపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.గోనిబీడు పోలీస్ స్టేషన్ పరిధిలో పునీత్ అనే యువకుడు ఉంటున్నాడు.అతను ఓ మహిళతో తరచుగా మాట్లాడుతున్నాడు అనే ఆరోపణలు వచ్చాయి.దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇంకే ముంది పోలీసులు పీఎస్కు తీసుకొచ్చారు.నరకం అంటే ఏంటో అతనికి చూపించారు.కాళ్లు చేతులు కట్టేసి కొట్టారు.దాహం వేస్తుందని అడిగిన పాపానికి యూరిన్ పో శారు.నేలపై ఉన్న అదీ నాకాలని బెదిరించారు.అలా చేయకుంటే వదిలిపెట్టమని హెచ్చరించారు.తనను కులం పేరుతో కూడా దూషించారని చెప్పారు.ఈ నెల 10వ తేదీన ఈ ఘటన జరగగా అతను డీజీపీకి ఫిర్యాదు చేశాడు.ఘటనపై చిక్ మంగళూర్ డీఎస్పీ స్పందించారు.దర్యాప్తు జరుగుతుందని ఎస్సైని ట్రాన్స్ ఫర్ చేశామని వివరించారు.ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి.సదరు ఖాకీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...