ముంబై:దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు ఆగడం లేదు.ఈ ధరలు రోజురోజూకూ పైపైకి పోతున్నాయి.ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మ రింత పైకి వెళ్తున్నాయి.తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్పై 35 పైసలు,డీజిల్పై 31 పైసలు వరకు పెంచాయి.ఈ తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.81,డీజిల్ లీటర్ రూ.89.18కు పెరిగింది.గత నెల నుంచి ఇప్పటి వరకు 33 సార్లు లీటర్ పెట్రోల్పై రూ.8.49,డీజిల్పై రూ.8. 39 పెరిగింది.చెన్నైలో పెట్రోల్ రూ.99.80 డీజిల్ రూ.93.72గా ఉంది.మరో వైపు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్ రూ.105 వైపు పరుగులు పెడుతున్నది.ప్రస్తుతం లీటర్ ధర రూ.104.90 పలుకుతోంది.గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో సామాన్యులు బంకులకు వెళ్లాలంటేనే జంకా ల్సిన పరిస్థితి ఎదురవుతోంది.అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ను దాటగా డీజిల్ ధర రూ.100 వైపు పరుగులు పెడుతున్నది.హైదరాబాద్లో పెట్రోల్ రూ.102.69 డీజిల్ రూ.97.20,విజయవాడలో పెట్రోల్ రూ.104.58,డీజిల్ రూ.98.52 చొప్పున ఉన్నాయి.