హైదరాబాద్:తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.టీ శాట్,దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు.రికార్డ్ లెసన్స్ అన్నీ టీ శాట్ యాప్స్లో అందుబాటులో ఉంటాయ న్నారామె.46 G.O యథాతధంగా అమలవుతుందన్నారు.ఈ ఏడాది కూడా ట్యూషన్ ఫీజుల మాత్రమే వసూలు చేయాలన్నారు.30 శాతం ఫీజులు తగ్గించుకోమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.