హైదరాబాద్:రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి శనివారం(ఏప్రిల్ 10) ఈడీ హైదరాబాద్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది.దా దాపు 10కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది.ఇందులో భాగంగా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.గతంలో నాయిని దగ్గర పీఏగా పనిచేసిన ముకుంద రెడ్డి,ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న దేవికా రాణి ఇళ్ల ల్లోనూ సోదాలు జరిగాయి.సోదాల సందర్భంగా నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది.సోదాల్లో పలు కీలక పత్రాలతో పాటు రూ.1కోటి నగదు,బ్లాంక్ చెక్కులు,ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.రెండేళ్ల క్రితం తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణం సంచ లనం సృష్టించిన సంగతి తెలిసిందే.వైద్య కిట్లు,మందుల కొనుగోళ్ల విషయంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి నకిలీ బిల్లులు సృష్టించి వందల కోట్ల రూపాయలు కాజేశారన్న ఆరోపణలున్నాయి.ఈ కేసులో దేవికారాణితో పాటు తొమ్మిది మందిని ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.ఇప్పటికే అవినీతి అధికారిణి దేవికా రాణి నుంచి ఏసీబీ అధికారులు రూ.4.47 కోట్ల నగదును గతేడాది సెప్టెంబరులో స్వాధీనం చేసుకున్నారు.ఆమె కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీల్లో,రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు.అంతేకాదు,దేవికా రాణి ఎనిమిది డొల్ల కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించారు.ఇదే కే సులో నిందితురాలిగా ఉన్న సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి నాగలక్ష్మి దాదాపు రూ.50కోట్ల వరకూ అక్రమాస్తులు కూడబెట్టినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.దేవికా రాణి,ఈఎస్ఐ వ్యవస్థలోని పలువురు అధికారులు కలిసి అవసరం ఉన్నా లేకపోయినా మందులు,వైద్య పరికరాలు కొనుగోలు చేసి అసలు కన్నా ఎక్కువ ధరలతో బిల్లులు సృష్టించి ఈ స్కామ్కి తెరలేపారు.తాజాగా ఈడీ నిర్వహించిన సోదాలకు సంబంధించి అధికారిక వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...