మహబూబాబాద్:కరోనా మహమ్మారి మాటలకు అందని విషాదాన్ని మిగులుస్తోంది.కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది.నిత్యం వేల సంఖ్యలు జనాలు కరోనా బలవుతూనే ఉన్నారు.తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కరోనా ఓ కుటుంబాన్ని కబళించింది.కేవలం 11 రోజుల తేడాతో ఒకే ఇంట్లో నలుగురు కరోనాతో మృతి చెం దారు.వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మద్ది బిక్షం-మంగమ్మ(60) దంపతులు నివసిస్తున్నారు.వీరికి ఇద్దరు కుమారులు వీ రన్న(42)ఉపేందర్(39) ఉన్నారు.ఇద్దరు అన్నాదమ్ములు ప్రభుత్వ ఉద్యోగులు.ఇద్దరికీ పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన రిటైర్డ్ అయి న భిక్షం ఆయన సతీమణి మనుమలతో సంతోషంగా గడిపేవారు.అలాంటి కుటుంబాన్ని కరోనా ఊహించని కుదుపు కుదిపేసింది.మొదట భిక్షం కరోనా బారినపడ్డా రు.ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన ఆయన ఈ నెల 2న ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు.ఆ తర్వాత రెండు రోజులకు అంటే 4వ తేదీన పెద్ద కుమారుడు వీ రన్న కూడా కరోనాతో మృతి చెందాడు.ఇద్దరు ఇంటి పెద్దలను కోల్పోయిన దు:ఖం నుంచి తేరుకోకముందే చిన్న కుమారుడు ఉపేందర్ తల్లి మంగమ్మలను కూడా క రోనా బలితీసుకుంది.ఈ నెల 11న ఉపేందర్ 13న మంగమ్మ కరోనాతో మృతి చెందారు.కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో నలుగురు కరోనాతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.నలుగురు పెద్దలను కోల్పోవ డంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.బాధిత కుటుంబం రోధనలు స్థానికులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...