హైదరాబాద్:తెలంగాణలో కొంతకాలంగా ఎక్కడ చూసినా పీఆర్సీ పై జరుగుతుంది.తాజాగా పీఆర్సీ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు,ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్టుగా ప్రకటించారు.అసలు ఇంతకీ పిఆర్సీ,ఫిట్ మెంట్ అంటే ఏమిటి? వీటి వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు తెలుసా?పీఆర్సీ అంటే వేతన సవరణ కమిటీ.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులకు,పదవీ విరమణ పొంది ఫించన్ అందుకునే వారికి నిర్ణీత కా లం తర్వాత వేతనాలను సవరిస్తారు.అయితే వారికి ఎంత జీతం ఇవ్వాలి? అలవెన్సులు(భత్యం) ఎంత ఇవ్వాలి అనే విషయాలను పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సూచి స్తుంది.ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.ఈ కమిటీ వివిధ అంశాలపై అధ్యయనం జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా వేతనాల పెంపు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.అయితే ఈ నివేదిక ఆధారంగానే జీత భత్యాలు పెంచాలనే నిబంధన ఏమీ ఉండదు.నిజానికి కమిటీ సూచించిన దానికన్నా ఎ క్కువనే ప్రభుత్వాలు చెలిస్తుంటాయి.ఇక ఫిట్ మెంట్ విషయానికొస్తే నిత్యావసరాల ధరలు,ఇతర ఖర్చుల ఆధారంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు జీతాల పెం పు ఉంటుంది.దీనినే ఫిట్ మెంట్ అంటారు.వేతన సవరణలో భాగంగా పెరిగిన జీతాలకు ఫిట్ మెంట్ ను కూడా కలిపి చెల్లిస్తుంది ప్రభుత్వం.కేంద్ర ఉద్యోగులకు పదేళ్లకు ఒకసారి,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకు ఒకసారి వేతనాల్లో సవరణలు ఉంటాయి.ఉద్యోగికి అప్పటి వరకు ఉన్న డీఏను,ఫిట్ మెంట్ గా చెల్లించే మొత్తాన్ని కలు పుకుని కొత్త మూలవేతనాన్ని నిర్దారిస్తారు.అందుకోసం ఒక నిర్దిష్టమైన పే స్కేల్ ఉంటుంది.దీనికి ఇతర అలోవెన్సులను కూడా జోడించి నెల జీతాన్ని చెల్లిస్తారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...