హైదరాబాద్:తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతోంది,ఇటీవల కాలంలో రోజూవారీ పాజిటివ్ కేసులు మరోసారి 3 వేల మార్కును దాటాయి.కరోనా వైరస్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది,గాలిలో కూడా వైరస్ ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస రావు అన్నారు.ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో గత నాలుగు వారాలుగా కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాబోయే 4-6 వారాల పరిస్థితి అదే విధంగా ఉంటుంది.పరిస్థితి ఇలాగే కొనసాగితే మహారాష్ట్రలాగా పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారవచ్చునని ప్రభుత్వ వర్గా లు భావిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించకపోయినా,లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేసే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు పలు నివేది కలు వెల్లడించాయి.