హైదరాబాద్:ఇండియాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది.ప్రతిరోజూ లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవు తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిబంధనలు ఖచ్చితంగా ఫా లో కాకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.అటు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు,రాజకీయ నాయకులు,సినీ స్టార్లకు కరోనా సోకింది.ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత,భద్రతా సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.సిబ్బందికి కరోనా సోకడంతో పవన్ కళ్యాణ్ ముందుజాగ్రత్తలో భాగంగా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.అయితే తాజాగా పవన్ పరిస్థితి కాస్త అదుపు తప్పిందని సమాచారం.పవన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.ఈ పరీక్షల్లో ఆయనకు ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్ఫెక్షన్ కు గురైనట్లు తేలింది.దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...