తెలంగాణలో భానుడి ఉగ్రరూపం..

ఆసిఫాబాద్:తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.భానుడు అప్పుడే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు.నిన్న ఈ సీజన్‌లోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.ఇక హైదరా బాద్‌లోనూ నిన్న ఎండ మండిపోయింది.ఖైరతాబాద్‌లోని గణాంకభవన్ వద్ద 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-25.9 డిగ్రీలుగా నమో దైనట్టు అధికారులు తెలిపారు.ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనం గా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here