హైదరాబాద్:నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచులపై అటవీ అధికారులు దాడి చేయడాన్ని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) తీవ్రంగా తప్పుబట్టిం ది.అడవే ఆధారంగా జీవించే చెంచులను పాశవికంగా కొట్టడంపై ఆగ్రహించింది.అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా వద్ద ఈ నెల 26న చెంచులపై దాడి ఘటన పై సమగ్ర నివేదికను సమర్పించడంతోపాటు ఏప్రిల్ 26న నేరుగా తమ ఎదుట హాజరుకావాలని నాగర్కర్నూల్ డీఎ్ఫవోను ఆదేశించింది.ఈ ఘటనపై తెలంగాణ గిరిజ న సంఘం మంగళవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది.24 మంది బాధితుల్లో కొందరి తలలు పగిలాయని కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లింది.ఈ దాడిపై న్యాయవిచారణ జరిపించాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...