హైదరాబాద్:నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచులపై అటవీ అధికారులు దాడి చేయడాన్ని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) తీవ్రంగా తప్పుబట్టిం ది.అడవే ఆధారంగా జీవించే చెంచులను పాశవికంగా కొట్టడంపై ఆగ్రహించింది.అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా వద్ద ఈ నెల 26న చెంచులపై దాడి ఘటన పై సమగ్ర నివేదికను సమర్పించడంతోపాటు ఏప్రిల్ 26న నేరుగా తమ ఎదుట హాజరుకావాలని నాగర్కర్నూల్ డీఎ్ఫవోను ఆదేశించింది.ఈ ఘటనపై తెలంగాణ గిరిజ న సంఘం మంగళవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది.24 మంది బాధితుల్లో కొందరి తలలు పగిలాయని కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లింది.ఈ దాడిపై న్యాయవిచారణ జరిపించాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...