తిరుపతి:కరోనా బాధితులకు సరైన సమయానికి ఆక్సిజన్ అందక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చో టు చేసుకుంది.కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో కనీసం 11 మంది కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటిం చారు.మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు.సోమవారం రాత్రి 8:15 నుంచి 8:30 గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్ సమస్య ఏర్పడినట్లు తెలిపారు.దాదాపు 1000 మందికి చికిత్స జరుగుతోందన్నారు.ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.దీంతో ఐసీయూలోని బాధితులు ఊపిరాడక అల్లాడారు.అత్యవసర శ్వాస ఆడించేందుకు వైద్యు లు సీపీఆర్ చేశారు.బంధువులు కూడా బాధితులకు గాలి ఆడేందుకు అట్టముక్కలతో విసిరారు.అయినా ఆక్సిజన్ అందక 11 మంది కన్నుమూశారు.తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా వచ్చిందని ఆక్సిజన్ ఆలస్యం కావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.