హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రేపటి నుంచి 10రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది.ప్రగ తిభవన్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది.మే 12 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.లాక్డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశమిచ్చారు.నిత్యావసరాలు ఇతర వస్తువుల కొను గోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు.ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలూ నిలిచిపోనున్నాయి.అత్యవసర సేవలను మాత్రమే అనుమతించను న్నారు.ప్రతిరోజూ 20 గంటలపాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.లాక్డౌన్ సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.