న్యూఢిల్లీ:పశ్చిమబెంగాల్లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది.దాదాపు రెండేండ్ల కిందటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమైంది.కైలాస్ విజయవర్గీ య,శివప్రకాశ్,అరవింద్ మీనన్ వంటి సీనియర్ నాయకులను రాష్ర్టానికి పంపింది.కేంద్ర హోం మంత్రి అమిత్షా కూడా బెంగాల్పై ప్రత్యేక దృష్టిసారించారు.హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సహా జాతీయనేతాగణమంతా విస్తృతంగా పాల్గొన్నారు.ప్రధాని దాదాపు 20 సభల్లో పాల్గొనగా,అమిత్షా 50 సభలకు హా జరయ్యారు.రాజ్నాథ్,స్మృతీ ఇరానీ,ధర్మేంద్ర ప్రదాన్,యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలు కూడా విస్తృతంగా పర్యటించారు.మరోవైపు సువేంధు అధికారి సహా తృణమూ ల్లోని ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకున్నారు.గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలం గణనీయంగా పెరిగింది.అయినప్పటికీ పార్టీ అనుకున్న ఫలితాలను సా ధించలేకపోయింది.ఇతర పార్టీల నుంచి భారీగా వలసలను ప్రోత్సహించడం దెబ్బతీసిందని,పార్టీలో ముందునుంచీ ఉన్నవారిలో ఇది అసమ్మతి రగలించిందని పార్టీ నేతలు చెప్తున్నారు.మమత కాలిగాయంపైనా తీవ్ర విమర్శలు చేయడం వ్యతిరేక ప్రభావం చూపింది.ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఒక్కో విడుతపై ప్రత్యేక దృష్టిసారిచాలన్న వ్యూహం కూడా బెడిసికొట్టిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నారు.పోలింగ్ తొలి దశల్లో బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు రాగా,కరోనా సెకండ్వేవ్ తీ వ్రంగా ఉన్న చివరి దశల్లో ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కరోనా రెండో వేవ్ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఓటింగ్పై ప్రభావం చూపింది.చివరి మూడు విడుతల్లో ప్రధాని మోదీ తదితర కీలక నేతలు ప్రచారాన్ని రద్దు చేసుకోవడం లేదా వర్చువల్ మాధ్యమంలో నిర్వ హించడం ప్రభావం చూపింది.ఇదే సమయంలో మమత విస్తృత ప్రచారం నిర్వహించారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...