హైదరాబాద్:మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాకు పాల్పడ్డారంటూ మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక పూర్తిగా తప్పులతడకగా ఉంది.ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు కోసం నివేదికలో ఏం రాస్తున్నారో కూడా పట్టించుకోలేదు.ముఖ్యమంత్రి పెట్టిన గడువు కంటే ముందే ఇచ్చేయాలన్న తొందరలో రిపోర్ట్లో కలెక్టర్ పలు తప్పిదాలకు పాల్పడ్డారు.ఈటల రాజేందర్ కుటుంబలో ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా పట్టించుకోలేదు.ఈటల సతీమణి జమున పేరు ప్రస్తావించే చోట నిర్లక్ష్యంగా రిపోర్ట్ చేశా రు.ఈటల కుమారుడు నితిన్ రెడ్డిని జమున భర్తగా ప్రస్తావించారు.నితిన్ రెడ్డి తల్లిని ఆయనకు భార్యగా మార్చేశారు.ఈ రిపోర్ట్లో నితిన్ రెడ్డి పేరు ఎక్కడా లేదు.కానీ మధ్యలో ఆయన పేరు ఎందుకు వచ్చిందో తెలియడం లేదు.ఇక మరో చోట సంతకం చేసి దాని కింద తేదీని తప్పుగా రాశారు.1\5\21 బదులుగా 1\6\21 అని వేశారు.ఒక మంత్రి అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో ఏకంగా కలెక్టరే ఇన్ని తప్పులు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.తల్లికి భార్యకి తేడా తెలియకపోతే ఎలా అని పలువురు మండిపడుతున్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...