విజయనగరం:మనదేశంలో ఎన్నో రకాల మతాలు,సిద్ధాంతాలు,ఆచారాలు ఉన్నాయి.గ్రామాల్లో ఆచారాలను ఎక్కువగా పాటిస్తుంటారు.గ్రామాల్లో పాటించే ఆచారాలు చాలా చిత్రంగా ఉంటాయి.వర్షాలు కురవాలని కోరుతూ చాలామంది పూజలు చేస్తుంటారు.కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు.గ్రామదేవతలకు కోళ్లు,మేకలు బలి ఇస్తుంటా రు.అయితే,విజయనగరం జిల్లాలోని సాలూరు మండలంలో ఉన్న కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు వర్షాల కోసం వినూత్నంగా పూజలు నిర్వహించారు.ఈ గ్రామానికి సమీపంలో జాకరమ్మ కొండ ఉన్నది.ఆ కొండపై కొండభైరవుడు,జాకరమ్మ అమ్మవార్లు ఉన్నారు.కూర్మరాజు గ్రామం నుంచి రైతులు కొండపైకి చేరుకొని పూ జలు నిర్వహించారు.అనంతరం తమ వెంట తెచ్చిన కోడి,మేకలను బలిఇచ్చి వాటిని వండారు.పాయసం చేసి అమ్మవార్లకు ప్రసాదాలను సమర్పించి అనంతరం అకు ల్లో ప్రసాదం తీసుకున్నారు.కొండపైకి చేరుకున్న రైతులు మోకాళ్లు,మోచేతులను కింద ఆన్చి నాలికతో ప్రసాదాన్ని నాకుతూ తిన్నారు.చేతులతో ముట్టుకోకుండా ప్ర సాదాన్ని ఇలా తీసుకున్నారు.ఇది వింతగా కనిపించినా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమని వర్షాలు కురవని సమయంలో ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని చెబు తున్నారు ఆ గిరిజన రైతులు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...