హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో గ్రామస్థా యి నుంచి జిల్లాస్థాయి కమిటీల పునర్నిర్మాణంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు.అలాగే దళిత బంధు పధకం అమలుపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.దళిత బంధు పధకంపై ప్రజలను చైతన్యం చేయాలని అందుకోసం ప్రతీ ఊరులోనూ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అ న్నారు.అలాగే ప్రతిపక్షాలు చేసే తప్పుడు విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.కమిటీల ఏర్పాటు ప్రక్రియ వారంలో ప్రారంభం కావాలన్నారు.న వంబర్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీ ఉంటుందని తెలిపారు.రానున్న 20 ఏళ్లు కూడా టీఆర్ఎస్దే అధికారమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.దశలవారీగా అ న్ని వర్గాలవారికి న్యాయం చేస్తామని చెప్పారు.భవిష్యత్తులో బీసీ,మైనారిటీ,అగ్రవర్ణాలలోని పేదల కోసం పేదల బంధు కూడా తెస్తామని స్పష్టం చేశారు.కొత్త జిల్లా అ ధ్యక్షులను నియమిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.అటు సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్కు భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు.అనంతరం టీఆర్ఎ స్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ,వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఆ త ర్వాత జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.అక్టోబర్ చివర్లో లేదా నవంబర్లో టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు అని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.కాగా దళిత బంధుపై ప్రతిపక్షాలది పనికి మాలిన విమర్శలని ఆరోపించారు.విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్లో దళిత బంధుపై సూచనలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...