రాయ్పూర్:ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు,భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి.ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం.బీజాపూర్ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఛత్తీస్గఢ్ డీజీపీ డీఎం అవస్థీ తెలిపారు. మావోయిస్టుల ఉనికిని తెలుసుకున్న సీఆర్పీఎఫ్కు చెందిన ఎలైట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) యూనిట్,జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)కు చెందిన భద్రతా సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు.ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువైపులా కాల్పులు జరిగాయి.ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరో పది మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు కూడా చనిపోయినట్లు తెలిపారు.వెంటనే అదనపు భద్రతా దళాలను అక్కడికి తరలించినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...