టీపీసీసీ కథ..కాంగ్రెస్ లో వీహెచ్ చిచ్చు

హైదరాబాద్:తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుని ఎంపిక వ్యవహారం పార్టీలో కలకలం లేపుతోంది.ముఖ్యంగా ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ఖరారైందని,ఢిల్లీ నుంచి సమాచారం అందుతున్న నేపధ్యంలో గతంలో ఒక సారి రేవంత్ రెడ్డి ఆశలపై అగ్గినీళ్లు చల్లిన పాత కాపులు మళ్ళీ మ రోసారి ఆయనకు పీసీసీ పీఠందక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హను మంత రావు రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి,పీసీసీ అధ్యక్ష పద వి ఎలా ఇస్తారని నేరుగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీనే ప్రశ్నించారు.ఈ మేరకు సోనియా గాంధీకి లేఖ రాసిన వీహెచ్,రేవంత్ పై కేసులున్నాయని రేపు అయన జైలుకు పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.అంతే కాదు 44 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనను,నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అనుచరు లు ఫోన్ చేసి బెదిరిస్తునారని,బూతులు తిడుతున్నారని,రేపు అయన పీసీసీ చీఫ్ అయితే పార్టీ సీనియర్ నాయకులకు గాంధీ భవన్’లో ఎంట్రీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.వీహెచ్ పార్టీ మీద కూడా మండిపడ్డారు.రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పిెచాలని పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని అయినా పీసీసీ నేతలు ఎవరు రేవంత్ అనుచరుల బహిరంగ హెచ్చరికలను ఖండించలేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here