హైదరాబాద్:మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది.జూన్ 8వ తేదీన బీజేపీ కండువా కప్పుకోనున్నారు ఈటల రాజేందర్.అయితే రేపు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు.నాలుగురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన ఈటెల ఈ రోజు తన అనుచరులతో సమావేశం నిర్వహించారు.అయితే ఈటల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి,కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ తుల ఉమతో పాటు మరికొంతమంది ముఖ్యనాయకులు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తన సతీమణి జమునను పోటీలో నిలపాలని రాజేందర్ భావిస్తున్నారు.అయితే ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వం సూచన మేరకు ఈటల రాజేందర్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...