హైదరాబాద్:మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది.జూన్ 8వ తేదీన బీజేపీ కండువా కప్పుకోనున్నారు ఈటల రాజేందర్.అయితే రేపు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు.నాలుగురోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన ఈటెల ఈ రోజు తన అనుచరులతో సమావేశం నిర్వహించారు.అయితే ఈటల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి,కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ తుల ఉమతో పాటు మరికొంతమంది ముఖ్యనాయకులు బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తన సతీమణి జమునను పోటీలో నిలపాలని రాజేందర్ భావిస్తున్నారు.అయితే ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వం సూచన మేరకు ఈటల రాజేందర్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది.
Latest article
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...