డబ్బు సంపాదనకై..బాబాల అవతారం..చివరకు

హైదరాబాద్:ఈ జాబులు,వ్యాపారాలు ఎందుకు అనుకున్నారో,ఏమో ఏకంగా నకిలీ బాబాలుగా అవతారం ఎత్తారు.డబ్బు సంపాదనకై అడ్డదారి తొక్కారు.మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి ఎదు లాబాద్ గ్రామంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.క్షుద్రపూజల పేరుతో మచర్ల రాజు అనే వ్యక్తి వద్ద ఏడు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన మాతం చందు,ఎర్నాల సంజీవ్ అనే ఇ ద్దరు పాత నేరస్థులను భువనగిరి ఎస్ఓటి పోలీసులతో కలిసి అరెస్టు చేశారు.గత నెల 11న ఎదులాబాద్ లోని రాజు అనే వ్యక్తికి తాము సాధనా శూరులం అని పరిచయం చేసుకుని,ఇంట్లో దెయ్యా లు ఉన్నాయని,రాబోయే పౌర్ణమి లోపు ప్రత్యేక పూజలు చేయకపోతే చనిపోతావని బెదిరించారు.అప్పటికే తమ ఇంట్లో ఓ మరణం సంభవించిన కారణంగా పరిహారం చేసుకోవాలని నిర్ణ యించుకొని వారినే అతను పరిష్కారం అడిగాడు.ఆ పూజలు అలా అయ్యాయో లేదో ఇంటి కింద నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే నిధులు ఉన్నాయని,వాటిని బయటికి తీస్తామని వివిధ రూ పాలలో దా దాపు ఏడు లక్షల రూపాయలు వసూలు చేసుకొని పరారు అయ్యారు.దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు కేసు పెట్టగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు.గతంలో రాచకొం డ పరిధి రామన్నపేట పీఎస్ పరిధిలో ఇలా మోసం చేసి రేప్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన కరీంనగర్ జిల్లాకు చెందిన మాతం చందు అతని బంధువు సంజీవ్ గా గుర్తించి అరెస్టు చేసిన భువన గిరి ఎస్ఓటి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.వారి నుండి రూ.15 వేల నగదు,రెండు సెల్ ఫోన్లు,ఒక ఆల్టో కారు,పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here