హైదరాబాద్:మాములుగా ఆలయాలలో ప్రసాదంగా ఏ పులిహోరనో,చక్కెర పొంగలినో,దద్దొజనంను ప్రసాదంగా ఇవ్వడం మనం చూసే ఉంటాము.దాదాపు ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలలో తినే ప దార్థాలను నైవెధ్యంగా ఇస్తారు.ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొత్త కొత్త వాటిని ప్రసాదంగా ఇవ్వడం వినే ఉంటాము.తాజాగా ఇప్పుడు ఓ ఆలయంలో మాత్రం దైవ దర్శనం కోసం వెళ్ళిన భక్తుల కు మాత్రం బంగారు నాణెం లేదా వెండి,డబ్బులను ప్రసాదంగా ఇస్తున్నారట.ఏంటీ నిజమా అని ఆశ్చర్య పోకండి.మీరు విన్నది అక్షరాల నిజం అక్కడ ఓ అమ్మవారి ఆలయంలో ప్రసాదంగా వస్తువు లను,డబ్బులను ఇస్తున్నారట.ఈ ఆలయం కూడా మన దేశంలోనే ఉందట.ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో బంగారం,నగదును ప్రసాదంగా ఇస్తారు.మధ్యప్రదేశ్ లో ఉన్న రత్లామ్ మహాలక్ష్మి ఆలయం ఏడాది పొడువునా భక్తులతో రద్దీగా ఉంటుంది.అమ్మవారికి భక్తులు నగలు,కోట్లది రూపాయల నగదు,వెండి ఆభరణాలు సమర్పించుకుంటారు.అలా అమ్మవారికి ఇస్తే అమ్మవారు మళ్ళీ ఆ సొమ్మును డబుల్ చేస్తుందని నమ్ముతున్నారు.అమ్మవారికి ఏది సమర్పించినా అది రెట్టింపవుతదని భక్తుల నమ్మకం.ఈ ఆలయానికి కుబేరుని నిధిగా పేరు ఉంది.దీపావళి సందర్భంగా ఈ ఆల యంలో ఐదు రోజులపాటు దీపోత్సవం నిర్వహిస్తారు.ఆ సమయంలో పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు,డబ్బులతోనే అలంకరిస్తారు.అదేవిధంగా భక్తులు ఆలయాన్ని దర్శించుకు న్న తర్వాత ఎవరూ తిరిగి ఖాళీ చేతులతో వెళ్లరు.ఎందుకంటే భక్తులకు బంగారం,వెండి లేదా డబ్బులు ఇలా ఏదో ఒకటి ప్రసాదంగా ఇస్తారట.భలే ఉంది కదా ఇంకో విషయం ఏంటంటే అక్కడ అమ్మ వారికి కానుకలు ఇచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువ.అందుకే ఆలయం మొత్తం డబ్బు,బంగారు,వెండి వస్తువులతో నిండిపోయి ఉంటుంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...