హైదరాబాద్:మాములుగా ఆలయాలలో ప్రసాదంగా ఏ పులిహోరనో,చక్కెర పొంగలినో,దద్దొజనంను ప్రసాదంగా ఇవ్వడం మనం చూసే ఉంటాము.దాదాపు ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలలో తినే ప దార్థాలను నైవెధ్యంగా ఇస్తారు.ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొత్త కొత్త వాటిని ప్రసాదంగా ఇవ్వడం వినే ఉంటాము.తాజాగా ఇప్పుడు ఓ ఆలయంలో మాత్రం దైవ దర్శనం కోసం వెళ్ళిన భక్తుల కు మాత్రం బంగారు నాణెం లేదా వెండి,డబ్బులను ప్రసాదంగా ఇస్తున్నారట.ఏంటీ నిజమా అని ఆశ్చర్య పోకండి.మీరు విన్నది అక్షరాల నిజం అక్కడ ఓ అమ్మవారి ఆలయంలో ప్రసాదంగా వస్తువు లను,డబ్బులను ఇస్తున్నారట.ఈ ఆలయం కూడా మన దేశంలోనే ఉందట.ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో బంగారం,నగదును ప్రసాదంగా ఇస్తారు.మధ్యప్రదేశ్ లో ఉన్న రత్లామ్ మహాలక్ష్మి ఆలయం ఏడాది పొడువునా భక్తులతో రద్దీగా ఉంటుంది.అమ్మవారికి భక్తులు నగలు,కోట్లది రూపాయల నగదు,వెండి ఆభరణాలు సమర్పించుకుంటారు.అలా అమ్మవారికి ఇస్తే అమ్మవారు మళ్ళీ ఆ సొమ్మును డబుల్ చేస్తుందని నమ్ముతున్నారు.అమ్మవారికి ఏది సమర్పించినా అది రెట్టింపవుతదని భక్తుల నమ్మకం.ఈ ఆలయానికి కుబేరుని నిధిగా పేరు ఉంది.దీపావళి సందర్భంగా ఈ ఆల యంలో ఐదు రోజులపాటు దీపోత్సవం నిర్వహిస్తారు.ఆ సమయంలో పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు,డబ్బులతోనే అలంకరిస్తారు.అదేవిధంగా భక్తులు ఆలయాన్ని దర్శించుకు న్న తర్వాత ఎవరూ తిరిగి ఖాళీ చేతులతో వెళ్లరు.ఎందుకంటే భక్తులకు బంగారం,వెండి లేదా డబ్బులు ఇలా ఏదో ఒకటి ప్రసాదంగా ఇస్తారట.భలే ఉంది కదా ఇంకో విషయం ఏంటంటే అక్కడ అమ్మ వారికి కానుకలు ఇచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువ.అందుకే ఆలయం మొత్తం డబ్బు,బంగారు,వెండి వస్తువులతో నిండిపోయి ఉంటుంది.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...