వరంగల్:ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేసారు.అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుండి సుమారు 6లక్షల రూపాయల విలువగల 75గ్రాముల మూడు బంగారు పుస్తేల త్రాడులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు,రెండు సెల్ఫోన్లను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన వారిలో మొదటి నిందితుడు పుల్లూరి రాజేష్,వయస్సు 32,నివాసం ధర్మారం గ్రామం,జమ్మికుంట మండ లం,కరీంనగర్ జిల్లా కాగా మరో నిందితుడు బత్తులరాజు,వయస్సు 32,గోల్లగూడెం గ్రామం, సైదాపూర్ మండలం,కరీంనగర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తిం చారు.ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీస్ అరెస్టు చేసిన నిందితులు ఇద్దరు ఒకే కళాశాలో డిగ్రీ కల్సి చదవడం ద్వారా ఇద్దరి మధ్య స్నేహం కుదరటంతో పాటు నిందితులిద్దరు యం.బి.ఏ చదువుకోని నిందితుల్లో ఒకరైన పుల్లూరి రాజేష్ పాన్షాపు నిర్వహిస్తుండగా, మరోనిందితుడు బత్తుల రాజు మెడికల్ రిప్రజెంటివ్ పనిచేస్తువుండేవారు.నిందితులు చోరీ చేసే ముందు ముందుగా తమ స్వగ్రామల నుండి తమ ద్విచక్రవాహనాలపై ముందుగా నిందుతులో ఒకరి ద్విచక్రవాహనాన్ని తమ అనుకూలమైన ప్రాంతంలో పార్కింగ్ చేసి మరో ద్విచక్ర వాహనంపై చైన్ స్నాచింగ్ చేసేందుకు బయలుదేరివే ళ్ళేవారు.ఈ క్రమంలో నిందితులు తమ వాహనం వెనుకవైపు వాహనం నంబర్ కనపడకుండా నల్లరంగు ప్లాస్టర్ తో మూసి వేసేవారు.చోరీ అనంతరం నిందితులద్దరు తమ వాహనాల్లో తిరిగి తమ ఇళ్లకు చేరుకోనేవారు.ఈ చోరీలపై సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా సూచనల మేరకు కాజీపేట ఎ.సి.పి రవీంద్ర కుమార్ అధ్వర్యంలో ధర్మసా గర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్,వేలేరు ఎస్.ఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు నిర్వహించగా,ప్రస్తుతం పోలీసులు తమ అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిం దితులను గుర్తించడంతో పాటు వారి కదలికలపై నిఘా పెట్టారు.మడికొండకు వస్తుండగా ధర్మసాగర్ ఇన్ స్పెక్టర్ అదేశాల మేరకు వేలేరు ఎస్.ఐ వెంకటేశ్వర్లు,ప్రొబేష నరీ ఎస్.ఐ హఫీజా తమ సిబ్బందితో కల్సి వేలేరు పీచర క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహన తనీ ఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానస్పదం పోలీసులను నిందితులను వెంబడించి పట్టుకొని తనీఖీ చేయగా నింది తుల వద్ద మూడు బంగారు పుస్తేల త్రాడ్లను గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన చైన్ స్నాచింగ్ చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించారు.చైన్ స్నాచింగ్ దొంగలను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన కాజీపేట ఎ.సి.పి రవీందర్ కుమార్,ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ రమేష్,వేలేరు ఎస్.ఐ వెంక టేశ్వర్లు,ప్రొబేషనరీ ఎస్.ఐ హఫీజా,ఎ.ఎస్.ఐ ఉమాకాంత్,కానిస్టేబుల్లు రమేష్ బాబు,ఆహ్మద్,హసనపర్తికానిస్టేబుల్ క్రాంతికుమార్,రమేష్ లను పోలీస్ కమిషనర్ అభి నందించారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...