విరుష్క విరాళాల సేకరణకు..విశేష ఆదరణ

న్యూఢిల్లీ:కొవిడ్​తో పోరాడుతున్న మన దేశానికి అండగా నిలిచేందుకు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క కలిసి ప్రారంభించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.ఇప్పటివరకు 11కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి.వారం రోజుల్లో 7 కోట్ల నిధులను సేకరించాలనే లక్ష్యంతో విరుష్క జోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ప్రముఖ విరాళాల సేకరణ వెబ్​సైట్​ కెట్టో ద్వారా ఆర్థిక సాయం అందించాలని మే7న తమ అభిమానులు శ్రేయోభిలాషులను కోరారు. తమ వంతు సాయంగా 2 కోట్లను విరాళంగా ప్రకటించారు.అయితే ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగానే అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు సమకూరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here