వెబ్ సిరీస్‌లోకి సింగర్ సునీత

హైదరాబాద్:సింగర్ సునీత కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు.తన భర్త రామ్ వీరపనేనితో కలిసి వెబ్ సిరీస్‌లను నిర్మించనున్నట్లు సమాచారం.మ్యాంగో బ్యాన ర్‌పై వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వెబ్‌సిరీస్‌లకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారట.దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఓటీటీ కంటెంట్‌ ప్రభావం నేపథ్యంలో పెద్ద సినిమాలు సైతం డిజిటల్‌ ఫ్లాట్‌పాంలలో వి డుదలవుతుండటంతో ఓటీటీల వైపు సినీ ప్రముఖులు అడుగులేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here