హైదరాబాద్:తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం,మలయాళం ఇండస్ట్రీలలో కూడా సాయి పల్లవి కి మంచి క్రేజ్ ఉంది.ఇప్పటివరకు సాయిపల్లవి నటించిన సినిమాల్లో దాదాపుగా అన్ని సినిమాలు కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.మరి ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ కి ఎం తోమంది అభిమానులు ఉన్నారు.ఇక తెలుగులో ఫిదా,మిడిల్ క్లాస్ అబ్బాయి,శ్యామ్ సింగరాయ్,లవ్ స్టోరీ,పడి పడి లేచే మనసు లాంటి సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.అదేమిటంటే సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందా? అంటే టాలీవుడ్ సినీ వర్గాల్లో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ,శ్యామ్ సింగరాయ్ లాంటి ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.అయి తే ఈ సినిమాలు విడుదలైన తర్వాత సాయి పల్లవి మరి కొత్తగా ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు.హీరో రానాతో కలిసి నటించిన విరాటపర్వం సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు.అయితే కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా,అలాగే ఎలాంటి సినిమా వేడుకల్లో ఆమె కనిపించకపోవడంతో సాయి పల్లవి త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అందువల్లే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై సాయిపల్లవి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...