హైదరాబాద్:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రో ల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్,డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నా యి.తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు.తెలంగాణ రాజధాని హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.64గా ఉంది.ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.101. 66గా ఉంది.కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.81గా ఉండగా లీటర్ డీజిల్ ధర ధర రూ.101.80గా ఉంది.ఖమ్మంలో పెట్రోల్ ధర రూ.109.29గా ఉండగా డీజిల్ ధర రూ. 102.24గా ఉంది.మెదక్లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.75గా ఉండగా డీజిల్ ధర రూ.102.29గా ఉంది.రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.64 ఉండగా డీజిల్ ధర రూ.101.66గా ఉంది.వరంగల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.41 పలుకుతుండగా లీటర్ డీజిల్ ధర రూ.101.43గా ఉంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...