న్యూఢిల్లీ:దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది.ఒకరోజు విరామం తర్వాత చమురు ధరలను పెంచుతూ ఆదివారం విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.లీట రు పెట్రోల్పై 24పైసలు,లీటరు డీజిల్పై 27పైసలను పెంచాయి.తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.92.58,డీజిల్ ధర రూ. 83.22కు చేరాయి.హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.22,డీజిల్ రూ.90.73గా ఉన్నాయి.ఇప్పటికే మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రో ల్ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే.ఇక ముంబయిలో త్వరలోనే సెంచరీ కొట్టే దిశగా సాగుతున్నాయి.ఇంధన ధరల్లో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాయే అధికంగా ఉండడం గమనార్హం.కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను కింద లీటర్ పెట్రోల్పై రూ.32.90,డీజిల్పై రూ.31.80 వసూలు చేస్తోంది.వివిధ నగరాల్లో పెట్రోల్ (లీ టర్ రూ.లలో)డీజిల్(లీటర్ రూ.లలో)కోల్కతా 92.67-86.06,ముంబై 98.88-90.40,బెంగళూరు 95.33-87.92,హైదరాబాద్ 96.22-90.73,తిరువ నంతపురం 94.81-89.70,చెన్నై 94.31-88.07 లు ఉన్నాయి.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...