హైదరాబాద్:కరోనా వైరస్ ఇంకా పోలేదని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు మళ్లీ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశ వ్యాప్తంగా కరొనా కేసులు సంఖ్య పెరుగుతోందని గడిచిన మూడు రోజులగా తెలంగాణలొ 100 సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయని ఆయన వివరించారు.రాష్ట్రంలో ఎక్కువ కే సులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో నమోదవుతున్నాయని ఆయన అన్నారు.గత మూడు నెలల తర్వాత కేసుల పెరుగుదల స్పష్టంగా తెలుస్తోందని ఆయన తెలిపారు.రాష్ట్రంలో ఒమిక్రాన్ BA2 వెరియంట్ కేసులు నమోదవుతున్నాయని వీటిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తున్నాయని ఆయన చెప్పారు.ఈ వ్యాధి బారిన పడిన వారికి జలుబు,గొంతు నొప్పి మాత్రమే వస్తోందని ఆయన తెలిపారు.ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే దగ్గరల్లొని ప్రభుత్వ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవాలను సూచించారు.జూన్ 3వ తేదీ నుండి ఇంటి ఇంటికి తిరిగి వ్యాక్సిన్ ఇస్తున్నామని 12 నుం డి 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు.జిహెచ్ఎంసి పరిధిలో 12 నుండి 18 ఏళ్ల వారు వ్యాక్సిన్ తీసుకొని వారు చాల మంది ఉన్నారని శ్రీనివాసరావు అన్నారు.జూన్ 13 నుండి విద్యాసంస్థలు ప్రారంభం కాబోతుంది కాబట్టి వ్యాక్సిన్ తీసుకోని వారంతా తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకొవాలని సూచించారు.హైదరాబాద్ లొ డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది.సీజనల్ వ్యా ధుల సంఖ్యలో పెరుగుదల కన్పిస్తోంది.ఈ ఏడాది డెంగీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని శ్రీనివాసరావు వెల్లడించారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...