అమరావతి:ఈ నెలాఖరుతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియనుండగా ఆంధ్రప్రదేశ్కు కొత్త ఎస్ఈసీ నియమితులు అయ్యారు.అందరూ ఊహించినట్టుగానే మాజీ సీఎస్ నీలం సాహ్నినిని కొత్త ఎస్ఈసీగా నియమించారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాహ్నికి ఈ అవకాశం కల్పించారు.సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు నీలం సాహ్ని ఇక ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్నిని ఆమె పదవీకాలం ముగియడం తో సీఎం వైఎస్ జగన్ ముఖ్య సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే.ఇక మొత్తం ముగ్గురి పేర్లు ప్రతిపాదించగా గవర్నర్ నీలం సహానీకి అవకాశం దక్కింది.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...