కొత్త చరిత్ర సృష్టించిన లవ్‌స్టోరి..

హైదరాబాద్:అక్కినేని హీరో నాగ చైతన్య,సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం సె ప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా ఇప్పుడు మొదటి రోజు కి గాను కలెక్షన్స్ పరంగా భీభత్సమైన రికార్డులను నమోదు చేసేలా కనిపిస్తుంది.నాగ చైతన్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకోనుంద ని తెలుస్తోంది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ తో 5 కోట్ల షేర్ ని మినిమం అందుకునేలా కనిపించిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలతో 6.5 కోట్ల కి తగ్గని కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం ఉంది.ఈ సినిమా సెకెండ్ వేవ్ తర్వాత మొట్ట మొదటి సారిగా 10 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది.ప్రీమియర్ షోలతో సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఓవర్సీస్ లో కూడా సొంతం చేసుకుంది.లవ్ స్టోరి ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ 13 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు.ఇక అది అలా ఉంటే ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సంవత్సరంలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా కలెక్ట్ చేయని మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుందని తెలుస్తోంది.అమెరికాలో ప్రీమియర్స్ పరంగా 2021లో ఇండియాలో ఏ సినిమాకు రాని కలెక్షన్స్ ఈ లవ్ స్టోరికి వచ్చాయని తెలుస్తోంది.దీనికి సంబంధించి చిత్రబృందం ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది.అంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌,అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ కు ఇన్ని కలెక్షన్స్ రాలేదని సమాచారం. దీంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.ఈ సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే నైజాంలో 250 వరకు థియేట ర్స్ లో విడుదలవ్వగా ఆంధ్రలో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో లవ్ స్టోరి 650 వరకు థియేటర్స్ రిలీజ్ అయ్యిందని తెలు స్తోంది.ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ టాక్ రావడం మొదలైంది.దీనికి కారణం లేకపోలేదు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్,టీజర్,పాటలు సి నిమాపై మరిన్ని అంచనాలు పెంచగా,మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది.మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వా న్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి.ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి.నాగచైతన్య ‘మజిలీ,వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వా త శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగా యి.ఇక మరోవైపు ఈ సినిమా కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది.సినిమాకి మొత్తం మీద 31.2 కోట్ల బిజినెస్ సొంతం అవ్వగా సినిమా ఇప్పుడు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.వీటికి తోడు,ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది.ఈ సి నిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది.ఈ పాట ఇప్పటికే మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించింది.లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్,రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు.పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు.రావు రమేష్,దేవయాని,ఉత్తేజ్,ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here