హైదరాబాద్:తెలంగాణ సిఎం కేసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు వా క్సిన్ తయారీలో మోడీ చూపించిన చొరవ అభినందనీయమన్నారు.స్వదేశీ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయకుండా ఉంటే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని. రాబోయే రోజుల్లో వాక్సినేషన్ లో అగ్రస్థానంలోకి మన దేశం రానుందని పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల సీఎంలు మోడీకి కృతజ్ఞతలు తెలిపారని తెలంగాణ సీఎం కేసిఆర్ మాత్రం స్పందించలేదని.ఆయనొక సంస్కార హీనుడని మండిపడ్డారు.రూ.2,500 కోట్లు ఎక్కడ ఖర్చు చేసావు.కమిషన్లు పోయాయనే పీఎంకి కృతజ్ఞతలు చెప్పలేద న్నారు.వ్యాక్సిన్ వృధాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.పార సీటమాల్ తో కరోనా పోతుందన్న సీఎం ఇప్పుడు వైద్య మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.కేంద్రాన్ని విమర్శించడం తప్ప కేసిఆర్ ఏమీ చేయడం లేదని ఆరోగ్య శ్రీ లో కరోనాను చేర్చాలని డిమాండ్ చేశారు.ఒకాయన సిద్దిపేటలో ఇంకోకాయన ట్విట్టర్ లో మాట్లాడుతారని చురకలు అంటించారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...