నేడు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి కేసీఆర్..రోగుల్లో ధైర్యం నింపేందుకు..

వరంగల్:తెలంగాణలో కరోనా బారిన పడిన రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంతోపాటు మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్నారు.బుధవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులకు కొండత ధైర్యాన్నిచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఇవాళ వరంగల్ ఎంజి ఎం ఆసుపత్రిని సందర్శించనున్నారు.ఇప్పటికే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్న విధానం,సౌకర్యాలు తదితర వివరాలు సీఎం కేసీఆర్ నేరుగా బాధితులను కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే.మరింత మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లకు కేసీఆర్ ఆదేశా లు కూడా జారీ చేశారు.మరో వైపు వారు చేస్తున్న సేవను అభినందించారు.అదే క్రమంలో నేడు వరంగల్ ఎంజిఎంలో కూడా సందర్శించి,మెరుగైన సౌకర్యాలు,బాధి తుల్లో ధైర్యం నింపనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here