హైదరాబాద్:గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పెద్ద బాంబే పేల్చారు.కేసీఆర్ తీరును ఎండగట్టిన రాజేందర్ ప్రగతి భవన్ టార్గెట్ గా ఘా టు వ్యాఖ్యలు చేశారు.బానిసగా ఉండలేకే బయటికి వచ్చానన్నారు.కేసీఆర్ పై ఈటల చేసిన ఆరోపణల కంటే మంత్రి హరీష్ రావును ఈ వివాదంలోకి లాగడమే హాట్ టాపిక్ గా మారింది.ఒక రకంగా హరీష్ రావును ఈటల రాజేందర్ ఇరికించారనే చర్చ జరుగుతోంది.గత ఐదేండ్లుగా తాను అవమానాలకు గురవుతున్నానని చెప్పిన ఈటల.తానే కాదు హరీష్ రావు కూడా అవమానించబడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు హరీష్ రావును కేసీఆర్ కుటుంబం వేధించిందని ఎన్నోసార్లు హరీష్ రావు తన ముందు ఏడ్చారని చెప్పారు.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న హరీష్ రావును కేసీఆర్ దూరం పెట్టారని గతంలో ప్రచారం జరిగింది.హరీష్ రా వు కొన్ని నెలల వరకు ప్రగతి భవన్ రాకపోవడం,పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనపోవడం ఇందుకు బలాన్నిచ్చింది.2018లో రెండోసారి అధికారంలోకి వ చ్చిన తర్వాత కేబినెట్ లోకి ఈటలతో హరీష్ రావును తీసుకోలేదు.దీంతో హరీష్ ను కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారనే వార్తలు వచ్చాయి.పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరిని హరీష్ తయారు చేశారనే అనుమానాలు గులాబీ బాస్ కు ఉన్నాయట.తనకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడంతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారని సదరు నేతకు సంబంధించిన నివేదికలు కేసీఆర్ దగ్గర ఉన్నాయంటున్నారు.అందుకే ఆ నేతను కేసీఆర్ దూరం పెడుతున్నారని కథనాలు వచ్చాయి.తర్వాత ఉద్య మ నేతలను దూరం పెట్టారని విమర్శలు పెరగడంతో అయిష్టంగానే మంత్రివర్గంలో చోటు కల్పించారని అంటున్నారు.మంత్రులుగా ఉన్నాఈ ఇద్దరు నేతలకు పార్టీలో నూ ప్రభుత్వంలోనూ ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదనే చర్చ ఉంది.ఈ నేపథ్యంలో హరీష్ రావును కేసీఆర్ కుటుంబం అవమానించిందంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.మరోవైపు ఈటలతో పాటు హరీష్ రావుపై రెండేండ్లుగా కేసీఆర్ నజర్ పెట్టారని అంటున్నారు.వాళ్లిద్దరిపై వేటు కోసం చూ స్తున్న కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగియడం,మున్సిపల్ ఎన్నికలు ముగియడంతోనే యాక్షన్ మొదలు పెట్టారని అంటున్నారు.మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో ఏ ఎన్నికలు లేకపోవడంతో ఏం జరిగినా ఎన్నికల సమయానికి అంతా సర్ధుకుంటుందనే యోచనలో కేసీఆర్ ఉన్నారని భావిస్తున్నారు.ఈటల కథ ముగియడంతో తర్వాత టార్గెట్ హరీష్ రావే అనే చర్చ కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...