హైదరాబాద్:అవిగో ఉద్యోగాలు ఇవిగో నోటిఫికేషన్లు తెలంగాణలో గత నాలుగేండ్లుగా సాగుతున్న తంతు ఉంది.ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేయ డం అధికారులు హడావుడి చేయడం నిరుద్యోగులు ఆశతో ప్రిపరేషన్ మొదలు పెట్టడం జరుగుతున్నాయి.కొన్ని రోజుల తర్వాత ఉద్యోగాల ఊసే ఎత్తకుండా సర్కార్ సైలెంట్ కావడం ఎప్పటిలానే నిరాశతో నిరుద్యోగులు నిట్టూర్చడం కామన్ గా సాగుతోంది.అందుకే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు ప్రస్తుతం తెలంగాణ యువత.తాజాగా మరోసారి ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేస్తోంది.ఉద్యోగాల భర్తీ అంటూ ప్రభుత్వం కొన్ని రోజులుగా హడావుడి చేస్తోంది.ఏ క్షణమైనా నోటిఫికేషన్ వస్తుందనే రేంజ్ లో పాలకులు,అధికారులు కలరింగ్ ఇచ్చారు.కేబినెట్ సమావేశాలు నిర్వహించారు.దీంతో ఈసారి ప క్కా అనుకున్నారు.కాని రోజులైనా గడుస్తున్నా నోటిఫికేషన్ల జాడ లేకపోగా బుధవారం మరో బాంబ్ పేల్చింది కేసీఆర్ సర్కార్.కసరత్తు అంతా పూర్తైంది ఖాళీలను గుర్తించడం జరిగిందని వారం రోజులుగా చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఐదు రోజుల్లో పూర్తి వివరాలను అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసిందనే ప్రకటన వచ్చింది.దీంతో ఇన్ని రోజులుగా అధికారులు ఏం కసరత్తు చేశారు కేబినెట్ సమావేశంలో ఏం చర్చించారు మళ్లీ వివరాలు ఇవ్వాలని కోరడం ఏంటనే ప్రశ్నలు వస్తు న్నాయి.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కలిపి మొత్తం 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రిమండలికి వివరాలు కూడా సమర్పించిం ది.దీంతో బుధవారం నాటి కేబినెట్ భేటీలో ఖాళీల భర్తీపై ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఎదురుచూశారు.కానీ ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతించే అంశం మళ్లీ వా యిదా పడింది.అధికారులు అందించిన వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని సమగ్ర వివరాలను సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...