కోవిడ్-19తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాల వారు జూలై 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి:అల్లం నారాయణ

హైదరాబాద్:కరోనాతో మరణించిన జర్నలిస్టు లకు సంబంధించిన కుటుంబాల వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం 2 లక్షల రూపాయలు పొం దడానికి కోవిడ్-19తో మరణించిన అర్హత గల జర్నలిస్టుల కుటుంబాల వారు జూలై 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నా రాయణ తెలిపారు.కోవిడ్-19తో మరణించిన కుటుంబాలకు గతంలో మాదిరి గానే 5 ఏళ్లపాటు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది.అంతేగాక మరణిం చిన జర్నలిస్టు కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి ఒక వేయి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందిస్తామని ఆయన తెలిపారు.కోవిడ్-19తో మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు దరఖాస్తుతోపాటు అక్రిడి టేషన్ కార్డు,ఐడి కార్డు,ఆధార్ కార్డు,రెండు లక్షల లో పు ఆదాయ సర్టిఫికేట్,ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్,బ్యాంకు పాసు పుస్తకము,మూడు ఫోటోలు,జిల్లా వైద్యాధి కారిచే కోవిడ్-19 మరణధృవీకరణ పత్రం జతచేయా లని ఆయన సూచించారు.దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యా లయానికి స్వయంగా గాని,పోస్ట్ ద్వారా గాని ఈ నెల 25వ తేదీ వరకు పంపించాలన్నారు.గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు,ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.పూర్తి చేసిన దరఖాస్తులను కార్యదర్శి,తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ,హైదరాబాద్ చిరునామా:ఇంటి నెం.10-2-1,సమాచార భవన్,2వ అంతస్తు,ఎ.సి.గార్డ్స్,మాసాబ్ ట్యాంక్,తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాదుకు పంపవలసిందిగా ఆయన తెలియజేశారు.ఇతర వివరాలకు 7702526489 ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here