జైపూర్:రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ కు చెందిన సహదేవ్ సహరన్ ఓ రైతు.ఆయనకు ఐదుగురు కుమార్తెలు.వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కుమార్తెలంద రినీ చదివించాడు.ఐదుగురు అక్కా చెల్లెల్లు కలెక్టర్లే ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్ అయితే వీధి వీధి సంబంరాలు.ఆఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు.అ దే ఆ ఇంట్లో వారంతా కలెక్టర్లు అయితే కుటుంబానికి ఆనందానికి హద్దులే ఉండవు కదా.అటువంటి అరుదైన కుటుంబం సహదేవ్ సహరన్.ఆయనెమన్న ధనవంతు డా అనుకునేరూ కానే కాదు సాదాసీదా మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు.రాజస్థాన్ కు చెందిన ఓ రైతు కుటుంబం మాత్రం అందరిని అబ్బురపడేలా చేసింది. ఐదుగురు అక్కా చెల్లెళ్లు సర్కారీ కొలువులు సాధించి ఔరా అని పించారు.రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ కు చెందిన సహదేవ్ సహరన్ ఓ రైతు.ఆయనకు ఐదుగు రు కుమార్తెలు.వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కుమార్తెలందరినీ చదివించాడు.ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు.1) రోమా 2) మంజు3) అన్షు 4) రీతు 5) సుమన్ అని నామకరణం చేశారు.కొడుకులు లేరని ఏనాడు కుంగిపోలేదు సహదేవ్.అయితే తనకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండగా ఆ విషయాన్ని తన కుమార్తె లకు చెప్పారు.తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట బయటపెట్టారు.దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు ఎంతో కష్టపడి చదివారు.ఐదుగురు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవడమే కాకుండా కలెక్టర్లుగా ఎంపికయ్యి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు.ఈ అరుదైన కుటుంబం రాజస్తాన్లోని హనుమాఘర్ లో నివసిస్తోంది.2018 లో నిర్వహించిన రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించగా అన్షు, రీతు,సుమన్ లకు రాజస్తాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఆర్ఎఎస్)కు ఏకకాలంలో ఎంపికై అందర్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండ తమ వైపుకు దృష్టిని ఆకర్షించే లా చేశారు ఈ యువతులు.ఇప్పటికే ఆ ఇంట్లో రోమా,మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు.తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్ఎఎస్కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండటం విశేషం.