ములుగు:ములుగు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఓ గ్రామం అంతా కాలి బూడిదైపోయింది.ములుగు జిల్లాలోని శనిగాకుంట గ్రామంలో మంటలు చెలరేగాయి.దాదాపు 40 ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.గాలి బీభత్సం కారణంగా చెలరేగిన మంటలు దావానంలా ఊరంతా వ్యాపించాయి.దాంతో ఆదివాసీలు ప్రాణభయంతో పిల్లలను పట్టుకుని పరుగులు తీశా రు.ఈ ప్రమాదంతో 40 గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ములుగు జిల్లా మంగపేట,కన్నాయిగూడెంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది.ఈ గాలి దుమారం కారణంగా మంగపేట మండలం శనగకుంటలో ఇళ్లకు మంటలు అంటుకున్నాయి.ఆ మంటలు కాస్తా ఊరంతా వ్యాపించి భారీగా ఎగసిపడుతున్నాయి.ఆదివాసీ గూడెం మొత్తం అగ్నికి ఆహుతైపోతోంది.గ్రామంలోని గిరిజన కుటుం బాలు చెల్లాచెదురయ్యాయి.అగ్ని ప్రమాదంతో అలర్ట్ అయిన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.దాంతో ఆ ప్రాంతం అంతా అంధకారంగా మారింది.చిమ్మచీకట్లలోనే ఊరికి దూరం గా పిల్లలతో సహా పరుగులు తీశారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...