రామగుండం:జామకాయ పేదవాడి ఆపిల్గా పేరుపడింది.ఆరోగ్యానికి ఈ పండు చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.అందులోనూ జామకాయ ఆరోగ్యానికి,అందా నికి కూడా చాలా అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.పది ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ తినడం బెస్ట్ అంటారు పోషకాహారనిపుణులు చెప్పుతున్నారు.అలా ఎందుకు చె ప్పుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.ఆపిల్తో పోలిస్తే జామపండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.తరుచూ జామకాయలను తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సంత్రా(కమలాపండు)తో పోల్చి చూసినా జామపండులో ఐదు రెట్లు అధికంగా విటమిన్-సి ఉంటుంది.కిలో ఆకుకూరలో కంటే రెండింతల పీచుపదార్థం కిలో జామపండ్లలో లభిస్తుంది. ఇంకా జామలో కొవ్వు,కేలరీలు తక్కువ.అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.జామకాయ పచ్చిగా,దోరగా,పండుగా ఎలా ఉన్నా చిన్నవారి దగ్గర నుండి పెద్ద వారి వరకు అందరూ యిష్టంగా తినగలిగే కాయ జామకాయ.ఇది ఉష్ణమండల ప్రాంతమైన ఆసియా దేశాలలో ఎక్కువగా పండుతుంది.ఆకుపచ్చ రంగు తోలు కలిగి ఉంటుంది.బాగా పండినప్పుడు పండు పసుపు వర్ణంలోకి మారుతుంది.తొక్క లోపల కండ గులాబీరంగులో కానీ,తెలుపురంగులో కానీ,ఎరుపులో కాని ఉంటుంది.జామకాయ లేదాపండును తినటం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి.ప్రధానంగా జామకాయలో విటమిన్లు,పీచు,మినరల్స్సమృద్దిగా ఉన్నాయి.ఈ కాయల్లోని పీచు కారణంగా కొలెస్ట్రాల్,బిపి తగ్గుతాయి.బరువు తగ్గడానికి జామ చాలా బాగా సహాయపడుతుంది.ఇందులోని కార్బోహైడ్రేట్లు జీర్ణం కావడానికి సమయం పడుతుంది.దాంతో పొట్ట త్వరగా నిండిపోతుంది.ఆకలి వేయడానికి సమయం పడుతుంది.రోజు ఓ దోర జామపండు తింటే డయాబెిస్ నియంత్రణలో ఉంటుంది.ఒక రకంగా చెప్పాలంటే డయబెటిస్ ఉన్నావృకి జామకాయ ఒక వరం అని చెప్పాలి.జామకాయతో బ్లడ్ లోని గ్లూకోజ్ లెవెల్స్ను బాగా తగ్గించుకోవచ్చని,ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించి బ్లడ్ షుగర్ను తగ్గిస్తుందని డాక్టర్లు,న్యూట్రిషన్లు చెప్తున్నారు.పేగుల్లోని అధికంగా ఉన్న మ్యూకస్పొరను తొలగించి రక్తవిరేచనాలు తగ్గిస్తుందిమలబద్దకంతో బాధపడేవారికి,జామకాయలోని ఎక్కువగా ఉండే పీచుపదార్థాల వల్ల ఉపశమనం లభిస్తుంది.జీర్ణవ్యవస్థను బలంగా చేస్తుంది.అంతేకా క కడుపులోని మలినాలను,అంటు వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిములను తొలగిస్తుంది.జామపండులో వున్న విటమిన్ ఎ,సిలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.ఇక దంతా ల నొప్పికి,గొంతునొప్పి,చిగుళ్ల వ్యాధులను జామకాయలను నమలడం ద్వారా దూరం చేసుకోవచ్చు.పూర్వం జామ పుల్లలతో పళ్లు తోముకునేవారట.దానివలన చిగుళ్లకు సంబంధించి న ఎన్నో సమస్యలు తగ్గుతాయని మన పెద్దలు చెప్తారు.అంతేకాదు కేన్సర్ను ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ను నిరోధించే లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయని చెప్తారు.ఎసిడిటి,కీళ్ల నొ ప్పులు తగ్గించడానికి,థైరాయిడ్ నుంచి రక్షించడానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంది.జామకాయ జ్యూస్ కాలేయానికి కూడా ఒక మం చి టానిక్లాగా పనిచేస్తుంది.జామకాలో శరీరంలో సోడియం,పొటాషియం కంటెంట్ బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేయడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.జామకాయలో విటమిన్స్, మినరల్స్ వంటి వివిధ రకాల న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి.ఇవి మజిల్స్ ను బలోపేతం చేస్తుంది.మజిల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...